ఔరంగబాద్: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని మూసివేశారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్ సమీపంలో ఉన్న కుల్దాబాద్లో జౌరంగజేబు సమాధి ఉన్న విషయం తెలిసిందే. అయిదు రోజుల పాటు టూంబ్ను మూసివేస్తున్నట్లు ఇవాళ భారత పురావాస్తు శాఖ పేర్కొన్నది. నిజానికి స్థానిక మసీదు కమిటీ ఆ సమాధిని మూసివేయాలని భావించగా.. అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం ఎంఎన్ఎస్ నేత గజానన్ ఖాలే చేసిన ట్వీట్తో ఆందోళన మొదలైంది. మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి ఉండాల్సిన అవసరం ఏమి వచ్చిందని, దాన్ని ధ్వంసం చేయాలని ఆయన తన ట్వీట్లో ఆరోపించారు. ఆ ట్వీట్ తర్వాత కుల్తాబాద్ ఏరియాలోని ఓ మసీదు కమిటీ ఔరంగజేబు సమాధిని మూసివేయాలని నిర్ణయించింది.
ఆర్కియాలజీ శాఖ ఆధీనంలో ఉన్న ఆ సమాధికి మసీదు కమిటీ లాక్ చేయాలని చూసింది.ఈ నేపథ్యంలో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఔరంగజేబు సమాధిని మూసివేయాలని నిర్ణయించినట్లు ఔరంగబాద్ సర్కిల్ సూరింటెండెంట్ మిలన్ కుమార్ చౌలే తెలిపారు. ఇటీవల ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ సమాధిని విజిట్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే దృష్ట్యా ఔరంగజేబు సమాధిని 5 రోజుల పాటు మూసివేసినట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు.