న్యూఢిల్లీ: విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. అతడి పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఆ విమానాన్ని జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. (flight emergency landing) అనంతరం ఆ ప్రయాణికుడ్ని హాస్పిటల్కు తరలించారు. అలయన్స్ ఎయిర్కు చెందిన విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు టేకాఫ్ అయ్యింది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ విమానం గాలిలో ఉండగా 52 ఏండ్ల ప్రయాణికుడు అస్వస్థత చెందాడు. అతడి బీపీ క్రమంగా పడిపోసాగింది.
కాగా, ఆ ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితిపై విమాన సిబ్బంది ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో విమాన పైలట్లు జైపూర్ విమానాశ్రయాన్ని కాంటాక్ట్ చేశారు. దీంతో ఉదయం 9.40 గంటలకు ఫ్లైట్ను ఆ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. వెంటనే ఆ ప్రయాణికుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అలయన్స్ ఎయిర్ విమానం గమ్యస్థానమైన జబల్పూర్కు బయలుదేరింది. జైపూర్ విమానాశ్రయం అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆ ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నదో అన్నది స్పష్టం చేయలేదు.