KC Venugopal : చివరిదాకా సీఎం పదవి కోసం పోటీపడ్డ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ (Congress General Secretary) కేసీ వేణుగోపాల్ (KC Venugopal) కు ఆఖరికి నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ హైకమాండ్.. సీనియర్ నాయకులు అయిన కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల (Ramesh Chennithala) ను పక్కనపెట్టి.. గత ఎల్డీఎఫ్ హయాం (LDF term) లో సీఎల్పీ నేత (CLP Leader) గా వ్యహరించిన వీడీ సతీశన్ (VD Satheesan) కు సీఎం పదవి కట్టబెట్టింది. సీఎం పదవి ఆశించి భంగపడ్డ కేసీ వేణుగోపాల్ను మీడియా పలుకరించింది. సీనియర్లను కాదని వీడీ సతీశన్ను సీఎంగా ప్రకటించడంపై ఆయన అభిప్రాయాన్ని కోరింది.
దాంతో కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ.. కేరళంలో ప్రస్తుత పరిస్థితిపై, సీఎం పేరును ఖరారు చేసేందుకు జరిగిన ప్రక్రియపై పార్టీ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ చర్చించారని చెప్పారు. వాళ్లిద్దరూ తనకు ఫోన్ చేసి తన అభిప్రాయం అడిగారని.. అందరం కలిసి చర్చించామని అన్నారు. ఏదేమైనా తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. సీఎం ఎవరనే విషయంలో చివరగా పార్టీ తుది నిర్ణయం తీసుకున్నదని, కాంగ్రెస్ పార్టీ సిన్సియర్ నాయకుడిగా పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు.