తిరువనంతపురం: రక్షణశాఖ సీనియర్ అధికారులతో వెళ్తున్న ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులో కూలింది. ఈ ఘటన కూనూరు సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ హెలికాప్టర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ తన ఫ్యామిలీతో కలిసి ఆ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. తమిళనాడులోని కోయంబత్తూరు, సులూరు మధ్య ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు.