లక్నో, ఆగస్టు 9: జ్ఞానవాపీ మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) చేపట్టిన సర్వేకు మీడియాను దూరంగా ఉంచాలని వారణాసి జిల్లా కోర్టు ఆదేశించింది. సర్వే నిర్వహిస్తున్న చోట నుంచి మీడియా రిపోర్టింగ్ చేయటాన్ని న్యాయస్థానం నిషేధించింది. మీడియా, టీవీ ఛానల్స్తో కార్బన్ డేటింగ్ సర్వే నిర్వహిస్తున్న ఏఎస్ఐ సైంటిస్టులు, ఇతర అధికారులు అక్కడి విషయలేవీ పంచుకోరాదని, సర్వే నిర్వహిస్తున్న చోటకు మీడియాను అనుమతించరాదని జిల్లా జడ్జి ఏకే విశ్వేష్ బుధవారం ఆదేశాలు జారీచేశారు. వివాదాస్పద స్థలంలో ఆగస్టు 4 నుంచి ఏఎస్ఐ సర్వే మొదలైంది.