తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపునకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన ఆదివారం ఆలయం వద్ద గల వాహన మండపంలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.