Anurag Shukla | భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్రం త్రివిధ దళాల్లోని బలగాలకు శౌర్య పతకాలను ప్రకటించింది. భారత కోస్ట్ గార్డ్ కమాండెంట్ అనురాగ్ శుక్లా శౌర్య పతకాన్ని అందుకున్నారు. ఆయన ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండెంట్ పని చేస్తున్న అనురాగ్ శుక్లా.. గత ఏడాది డిసెంబర్లో గుజరాత్లోని ఓఖా తీరంలో ఆపరేషన్కు నాయకత్వం వహించారు. ఈ ఆపరేషన్లో పాక్కు చెందిన బోటును స్వాధీనం చేసుకున్నారు. అందులో 10 మంది ఉండగా.. వారి నుంచి రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రం కోస్ట్ గార్డ్ కమాండెంట్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున తత్రక్షక్ పతకాన్ని అందుకున్నారు.