భారతీయులు తెగ తినేస్తున్నారు..
తింటున్నది ఆహారం కాదు.. ఔషధాలు..
అది కూడా ప్రభుత్వ గుర్తింపులేని ఔషధాలే.. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 500 కోట్ల యాంటీబయాటిక్స్ మాత్రలు మింగారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ప్రైవేటు వైద్యరంగంలోనే 85-90 శాతం మందులు వాడారు.
ఈ దెబ్బకు భారతీయుల్లో యాంటీబయాటిక్ మందులు కూడా పనిచేయని స్థితి ఏర్పడిందని ఇటీవల లాన్సెట్ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధన వ్యాసంలో పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేశారు. అమెరికాకు చెందిన బోస్టన్ యూనివర్సిటీ, ఢిల్లీకి చెందిన పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కలిసి మనదేశంలో యాంటీబయాటిక్ మందుల వాడకంపై ఓ సర్వే నిర్వహించాయి. 500 ఫార్మాస్యూటికల్ కంపెనీలకు చెందిన ఉత్పత్తులను విక్రయిస్తున్న 9000 మంది స్టాకిస్టులతో కూడిన ప్యానల్ 2019లో విక్రయించిన యాంటీబయాటిక్స్పై అధ్యయనం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇవీ సర్వేలో తేలిన వాస్తవాలు
మనదేశంలో ఔషధాల విక్రయం, వినియోగంపై అమెరికా, యూరప్లో ఉన్నట్టు ఇప్పటికీ ఒక సరైన నిఘా విధానమే లేదు. దేశంలో యాంటీబయాటిక్స్ విచక్షణారహితంగా వాడుతున్నారు. వైద్యుడి ప్రిస్కిప్షన్ లేకున్నా ఈ ఔషధాలు తేలికగానే దొరుకుతాయి. గుర్తింపు పొందిన వైద్యులు కూడా రోగులకు వీటినే ఎక్కువగా రాస్తున్నారు
– హరికృష్ణ బూరుగు, ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్, యశోధ దవాఖాన.
500 కోట్లు
2019లో భారతీయులు మింగిన యాంటీబయాటిక్స్
85-90% వినియోగించిన మొత్తం యాంటీబయాటిక్స్లో ప్రైవేట్ వైద్యులు, దవాఖానలు సిఫారసు చేసినవి
అత్యధికంగా వాడినవి
అజిత్రోమైసిన్-500ఎంజీ (మొత్తంలో వాటా-7.6 శాతం)
సెఫిగ్జిమ్- 200 ఎంజీ (మొత్తంలో వాటా-6.5 శాతం)
72% భారతీయులు వాడుతున్న యాంటీబయాటిక్స్లో గతంలో డబ్ల్యూహెచ్వో వాడొద్దని చెప్పినవి