హవేరి: కర్ణాటకలో మరో లంచం వేధింపు ఘటన బయటపడింది. సీఎం బొమ్మై సొంత జిల్లా హవేరిలో ఒక రైతు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వలేక దాని బదులు ఎద్దును అప్పజెప్పడానికి ప్రయత్నించిన ఘటన జరిగింది. సవనూరు తాలుకాకు చెందిన బాధితుడు యల్లప్ప కథనం ప్రకారం… తన ఆస్తి పత్రాలను మార్చాలని స్థానిక మున్సిపాలిటీ అధికారులను కోరాడు. దానికి రూ.25 వేలు లంచం అడిగారు. ఆ మొత్తం ఇచ్చినా మరోసారి రూ.25 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన దగ్గర అంత డబ్బు లేదని, దానికి బదులుగా తన ఎద్దు తీసుకోవాలని అతడు ఆ పశువును మున్సిపాలిటీ కార్యాలయానికే తీసుకొచ్చాడు.ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.