న్యూఢిల్లీ : తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశా రు. రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదని భావించి రాజీనామా చేశారు. ఈ విషయమై ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా చర్చించారు.
తాను విమర్శించిన ఏఐఏడీఎంకేతో బీజేపీ చేతులు కలిపిన తర్వాత అన్నామలై రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన 8 నెలల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించవచ్చని సన్నిహితులు తెలిపారు. చాలా మంది యువ ప్రొఫెషనల్స్, మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయాలనుకొనేవాళ్లు కొత్త రాజకీయ వేదికకు ఆకర్షితులవుతారని చెప్పారు.