హైదరాబాద్, సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రైల్వే బోర్డు చైర్మన్, సీఈవోగా అనిల్కుమార్ లహోటి బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. రైల్వే బోర్డు చైర్మన్ కంటే ముందు అనిల్కుమార్ రైల్వే బోర్డు మెంబర్ (మౌలిక సదుపాయాలు)గా పనిచేశారు. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ 1984 బ్యాచ్కు చెందిన అనిల్కుమార్ రైల్వేతో పాటు రైల్వే బోర్డులో వివిధ హోదాల్లో పనిచేశారు.