అమృత్సర్: పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థాన్ మద్దతుదారుడు అమృత్పాల్ గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఖలిస్థాన్ ఉగ్రవాది జర్నైల్సింగ్ భింద్రన్వాలేలా కనిపించేందుకు అతడు జార్జియాలో కంటి శస్త్రచికిత్స చేయించుకున్నట్టు తెలిసింది.
ఈ మేరకు నిఘా వర్గాలు తెలిపాయి. అమృత్పాల్ అనుచరులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదుచేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. వారే అధికారులకు ఈ విషయం వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు, అమృత్పాల్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతున్నది. ఈ నెల 14 వరకు ఎవరూ సెలవు పెట్టకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి.