ఈ దేశంలో చాలామంది ఎన్నో రకాల బిజినెస్లు చేసి తమ జీవితాన్ని వెళ్లదీస్తూ ఉంటారు. అందరి గురించి మనకు తెలియదు. కొందరు మంచి ఆహారాన్ని అందించేందుకు క్వాలిటీ ఫుడ్ను అందించడంతో పాటు తక్కువ ధరకే వాటిని విక్రయిస్తుంటారు. అలాంటి వాళ్ల గురించి తెలియాలంటే సోషల్ మీడియానే బెస్ట్ ప్లాట్ఫామ్. తాజాగా సోషల్ మీడియాలో ఓ అమ్మ టిఫిన్ సెంటర్కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
బెంగళూరుకు చెందిన ఓ వృద్ధ మహిళ టిఫిన్ సెంటర్ పెట్టి.. తక్కువ ధరకే పలు రకాల టిఫిన్స్ను అందిస్తోంది. ప్లేట్ ఇడ్లీని కేవలం రూ.2.50 కే అందిస్తోంది. రూ. 5 కే దోశను అందిస్తోంది. తన ఇంట్లో పైన ఫస్ట్ ఫ్లోర్లో టిఫిన్స్ రెడీ చేసి.. కింద తను టిఫిన్ సెంటర్లో కూర్చుంటుంది. పై నుంచి కిందికి కస్టమర్ల కోసం బకెట్ ద్వారా టిఫిన్స్ను ఫ్రెష్గా తయారుచేసి కిందికి పంపిస్తారు. అలా 30 ఏళ్ల నుంచి తక్కువ ధరకే బెస్ట్ క్వాలిటీ టిఫిన్లను అందిస్తోంది అమ్మ. తక్కువ ధరకు మంచి టిఫిన్ అందించాలన్న లక్ష్యంతోనే గత 30 ఏళ్ల నుంచి అక్కడి స్థానికులకు అందిస్తున్నానని అమ్మ చెప్పుకొచ్చింది.
అమ్మ టిఫిన్ సెంటర్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి సూపర్బ్.. ఈ వయసులో ఇంత కష్టపడుతున్నావు.. తక్కువ ధరకు మంచి టిఫిన్ అందిస్తున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.