న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్లో భాగమా కాదా అన్న దానిపై ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ (Derek O’Brien) స్పష్టత ఇచ్చారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఆదివారం రాంలీలా మైదానంలో ప్రతిపక్షాల కూటమి నిర్వహించిన ‘లోక్తంత్ర బచావో’ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన డెరెక్ ఓబ్రెయిన్ ‘భారత’ కూటమిలో టీఎంసీ ఉంది, ఉంటుందని తెలిపారు. ప్రతిపక్షాల మెగా ర్యాలీ బీజేపీపై ప్రజాస్వామ్యం పోరాటమని అన్నారు. ఈ మేరకు రాసి ఉన్న బ్లాక్ టీ షర్టును ఆయన ధరించారు.
కాగా, పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను టీఎంసీ ప్రకటించింది. ‘ఇండియా’ బ్లాక్లో భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, వామపక్షాలకు ఎలాంటి సీట్లు కేటాయించబోమని మమతా బెనర్జీ ముందుగానే స్పష్టం చేశారు. అలాగే ఈ రెండు పార్టీలపై ఆమె మండిపడ్డారు. బెంగాల్లో టీఎంసీకి వ్యతిరేకంగా బీజేపీతో కలిసి కాంగ్రెస్, సీపీఎం పనిచేస్తున్నాయని ఆరోపించారు.
#WATCH | INDIA alliance rally: TMC MP Derek O'Brien says, "…All India Trinamool Congress (TMC) is very much was, is and will be part of the INDIA alliance. This is a fight of BJP versus democracy…" pic.twitter.com/5q2YuoHRCO
— ANI (@ANI) March 31, 2024