ముంబై: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్ను ఆయన వెల్లడించారు. ఒమిక్రాన్ వేళ కూడా ఆర్బీఐ తన వడ్డీ రేట్లను మార్చలేదు. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదని శక్తికాంత్ దాస్ తెలిపారు. రెపో, రివర్స్ రెపో రేట్లు యధాతథంగా ఉన్నాయన్నారు. రెపో రేటును 4 శాతం వద్దే ఉంచాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా ఉంచామని ఆయన తెలిపారు. వరుసగా తొమ్మిదోసారి ఆర్బీఐ వడ్డీ రేట్లను మార్చలేదు. భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గింపు వల్ల.. వాటి డిమాండ్ పెరుగుతుందని శక్తికాంత్ దాస్ అన్నారు. 2022 వార్షిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు టార్గెట్ 9.5 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందన్నారు.