న్యూఢిల్లీ, జూన్ 17: వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్ మెరిట్ ర్యాంకుల నిర్ధారణలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మార్పులు చేసింది.సమాన మార్కులు వస్తే ఇక నుంచి వరుసగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మార్కులను పరిగణలోకి తీసుకొని మెరిట్ ర్యాంక్ను ఇస్తారు. ఆ తర్వాత కూడా ఒకే మార్కులు వస్తే కంప్యూటర్ డ్రా నిర్వహించి మెరిట్ లిస్టు తయారు చేస్తారు. ఎంబీబీఎస్ కోర్సును అడ్మిషన్ తేదీ నుంచి తొమ్మిదేండ్ల లోగా పూర్తి చేయాలి. అది దాటితే ఆ కోర్సులో కొనసాగడానికి అనుమతి ఇవ్వరు. వచ్చే ఏడాది నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ఎన్ఎంసీ నోటిఫికేషన్ పేర్కొన్నది.