ముంబై: ‘నమస్కార్ భాయ్యోం ఔర్ బెహ్నో, మై ఆప్కా దోస్త్ అమీన్ సయానీ బోల్ రహా హూ’ అంటూ రేడియో ప్రియుల్ని అలరించిన గొంతు మూగబోయింది. దేశంలో కోట్లాది మందిని ఆకర్షించిన రేడియో ప్రెజెంటర్ సయానీ ముంబైలోని ఓ దవాఖానలో మంగళవారం రాత్రి కన్నుమూశారు. 91 ఏండ్ల సయానీకి గుండెపోటు రావటంతో దక్షిణ ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ దవాఖానకు తరలించామని, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు రజిల్ సయానీ చెప్పారు. సయానీ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అమీన్ సయానీ 50వేలకు పైగా రేడియో కార్యక్రమాలు నిర్వహించి రేడియో మ్యాస్ట్రోగా పేరు తెచ్చుకున్నారు.