శ్రీనగర్: ప్రతికూల వాతావరణం వల్ల అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు శుక్రవారం అధికారులు ప్రకటించారు. కశ్మీర్తో పాటు పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడంతో బల్తాల్, పహల్గాం మార్గాల్లో యాత్రికులను నిలిపివేసినట్టు సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ మోహిత శర్మ తెలిపారు. భారీగా మంచు కురుస్తుండటంతో బల్తాల్, నున్వాన్ బేస్ క్యాంప్ల్లో, చందర్కోట్లో యాత్రి కులను ఆపేశామన్నారు. కాగా అమర్నాథ్ యాత్రలో ఈ ఏడాది ఇప్పటివరకు ఆరుగురు యాత్రికులు వివిధ కారణాలతో మృతి చెందినట్టు అధికారులు చెప్పారు.