శ్రీనగర్, జూలై 6: అమర్నాథ్ యాత్ర బుధవారం తిరిగి ప్రారంభమైంది. భారీ వర్షాల కారణంగా మంగళవారం యాత్రను తాత్కాలికంగా నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. వాతావరణం మెరుగుపడటంతో బుధవారం ఉదయం యాత్రను తిరిగి ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. పహల్గామ్, బల్తాన్ రూట్ల నుంచి భక్తులు తిరిగి బయలుదేరినట్టు చెప్పారు.