న్యూఢిల్లీ, జనవరి 19: ఏప్రిల్ 1 నుంచి పదిహేనేండ్లు పైబడిన అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలను తుక్కుగా మార్చాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ నిర్ణయించింది. రవాణా కార్పొరేషన్లకు చెందిన బస్సులకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
అయితే, భద్రతా బలగాలు, శాంతిభద్రతల కోసం వాడే వాహనాలకు మాత్రం మినహాయింపును ఇచ్చింది. 2022 ఏప్రిల్ 1న నేషనల్ వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ ప్రకారం 15 ఏండ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు, 20 ఏండ్లు దాటిన కమర్షియల్ వాహనాలకు ఫిట్నెస్ పరీక్ష తప్పనిసరి. వీటిని స్క్రాప్గా మార్చితే కొత్త వాహనాల కొనుగోలులో రాయితీలు ఇస్తారు.