రాంచీ, నవంబర్ 16: సీఎం కుర్చీ నుంచి తనను దించడానికి బీజేపీ రకరకాల కుట్రలు చేస్తున్నదని, ఈ కుట్రలన్నీ విఫలమవుతాయని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అన్నారు. బుధవారం ఆయన రాంచీలో విలేకరులతో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో అస్థిరత సృష్టించి దొంగదారిలో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర చేస్తున్నది. ఇందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను వాడుకుంటున్నది. ఆ సంస్థ నాకు పదేపదే నోటీసులు జారీ చేస్తున్నది. అక్రమ బొగ్గు కుంభకోణమంటూ వేధిస్తున్నది. ఈ కుట్రలు, కుతంత్రాలు చిత్తు అవుతాయి’ అని పేర్కొన్నారు.