అహ్మాదాబాద్: గుజరాత్లోని పోరుబందర్ తీరం వద్ద విషాదం చోటుచేసుకున్నది. అరేబియా సముద్రంలో భారతీయ నౌకాదళానికి చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్( ALH helicopter) కూలింది. రెస్క్యూ కోసం వెళ్లిన ఆ హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు సిబ్బంది గల్లంతు అయ్యారు. ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. మోటార్ ట్యాంకర్ హరి లీలా నౌక వద్దకు రెస్క్యూ చేసేందుకు ఆ హెలికాప్టర్ వెళ్లింది. అయితే ఆ సమయంలో హార్డ్ ల్యాండింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఐసీజీ సిబ్బంది రంగంలోకి దిగింది. నాలుగు నౌకలు, రెండు విమానాల ద్వారా సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు. సోమవారం రాత్రి 11 గంటలకు ఏఎల్హెచ్ రెస్క్యూ ఆపరేషన్కు వెళ్లింది. కొన్ని రోజుల క్రితమే ఆ హెలికాప్టర్ గుజరాత్లో వదరల్లో చిక్కుకున్న 67 మందిని రక్షించింది.