న్యూఢిల్లీ: అనారోగ్యకరమైన జీవన శైలి, దురలవాట్లు.. ఇవన్నీ మగవాళ్లలో శుక్రకణాల డీఎన్ఏను దెబ్బతీస్తాయని ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధూమపానం, మద్యపానం, అధికమొత్తంలో ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవటం వంటివి శుక్రకణాల నాణ్యతను దెబ్బతీస్తాయని తెలిపారు. వంధ్యత్వం, గర్భస్రావాలు, పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు.. శుక్ర కణాల్లో డీఎన్ఏ దెబ్బతినటం వల్ల సంభవిస్తాయని వారు గుర్తుచేశారు.
గర్భధారణ, పిండం అభివృద్ధిలో తండ్రి పాత్రను విస్మరించలేమని ప్రొఫెసర్ డాక్టర్ రీమా దాదా చెప్పారు. మానసిక ఒత్తిడి గురైనా.. ఆ ప్రభావం స్పెర్మ్పై ఉంటుందన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, యోగా చేసే అలవాటుతో మైటోకాండ్రియల్, న్యూక్లియర్ డీఎన్ఏల సమగ్రతను పెంచుతుందని ఆమె వివరించారు.