లక్నో: ఒక రోగిపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. అతడ్ని కిందకు తోసి కాలితో తన్నారు. (Security Guards Kicks Patient) ప్రముఖ ఎయిమ్స్ హాస్పిటల్లో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి ఎయిమ్స్లో షాకింగ్ ఘటన జరిగింది. సిబ్బంది మాత్రమే వినియోగించే లిఫ్ట్లోకి ప్రవేశించేందుకు ఒక రోగి ప్రయత్నించాడు. అయితే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఆ రోగిని కొట్టడంతోపాటు కిందకు తోసి కాలితో తన్నారు.
కాగా, అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎయిమ్స్ రాయబరేలిలో రోగుల పట్ల జరుగుతున్న ఇలాంటి దారుణ సంఘటనలపై నెటిజన్లు మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఎయిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుయాష్ సింగ్ ఈ సంఘటనపై స్పందించారు. సెక్యూరిటీ సిబ్బంది తీరును ఖండించారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కాగా, ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు.
UP : रायबरेली एम्स में बाउंसरों ने एक मरीज को जूतों की ठोकर, लात-घूंसों से पीटा। वजह जो भी हो, पर ये गुंडई सरासर गलत है। pic.twitter.com/jZi1DX7VZK
— Sachin Gupta (@SachinGuptaUP) April 2, 2024