ముంబై: మహారాష్ట్రలోని అధికార శివసేనలో తిరుగుబాటు నేపథ్యంలో పార్టీ చీఫ్ ఉద్ధవ్, షిండే వర్గాలు పోటాపోటిగా చర్యలు, ప్రతి చర్యలతోపాటు మాటల దాడికి దిగుతున్నాయి. శుక్రవారం శివసేన భవన్కు తరలివచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులనుద్దేశించి ఉద్ధవ్ ఠాక్రే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అధికారంపై తనకు ఎలాంటి ఆశలేదన్నారు. తన ఆరోగ్యం సహకరించడంలేదని దీంతో తాను సరిగా పని చేయలేకపోతున్నానని, అందుకే పార్టీ నేతలను కలవలేదని చెప్పారు. మెడ, తల బాధతో పాటు కళ్లు కూడా తెరువలేక పోతున్నానని, అయినా కూడా దాని గురించి దిగులు లేదన్నారు. ఏక్నాథ్ షిండేకు తాను ఎంతో చేశానని, తన శాఖను కూడా ఆయనకు ఇచ్చినట్లు చెప్పారు. అలాగే షిండే కుమారుడు ఎంపీ అయ్యేందుకు సహకరించానన్నారు. ఇంత చేసిన తనపై షిండే చాలా ఆరోపణలు చేయడంతోపాటు పార్టీని చీల్చేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.
మరోవైపు ఉద్ధవ్ అనారోగ్యం ప్రస్తావనపై షిండే క్యాంప్ కౌంటర్ ఇచ్చింది. అస్సాం రాజధాని గౌహితిలోని హోటల్లో మకాం వేసిన రెబల్ బృందంలో భర్త యశ్వంత్ జాదవ్తో పాటు అక్కడ ఉన్న ఆ పార్టీ నాయకురాలు యామినీ జాదవ్ ఒక భావోద్వేగ వీడియోను విడుదల చేశారు. గత ఏడాది అక్టోబర్ నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు. అయితే పార్టీ నాయకత్వం తనను పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. క్యాన్సర్ని గుర్తించిన తర్వాత ముంబై మేయర్ కిషోరీ పెడ్నేకర్ తమ ఇంటిని సందర్శించారని, అయితే ఉద్ధవ్తో సహా అగ్ర నాయకత్వం తన ఆరోగ్యం గురించి ఎప్పుడూ అడగలేదని విమర్శించారు. రెబల్ నేత ఏక్నాథ్ షిండే తన అధికార ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను శుక్రవారం పోస్ట్ చేశారు.
शिवसेना आमदार सौ यामिनी (ताई) जाधव यांनी सांगितला भावपूर्ण प्रसंग…. आम्ही सर्व शिवसेनेतच पण हा निर्णय घेण्याची वेळ का आली हे सर्वांनी समजुन घ्यावं….
संकटकाळात पक्षाकडून साधी विचारपूस देखील नाही याचे मनात शल्य… pic.twitter.com/cAkFEocOYk
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) June 24, 2022