ISRO Chief | చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంకావడంతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్ ఎస్ సోమనాథ్ కేరళలోని ఆలయంలో ఆదివారం పూజలు నిర్వహించారు. పౌర్ణమికావు భద్రకాళి ఆలయానికి చేరుకున్న ఆయన.. అమ్మవారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రుడు, అంగారక గ్రహం, శుక్రగ్రహాలపైకి ప్రయాణించే సత్తా భారత్కు ఉందని.. అయితే మనలో ఆత్మవిశ్వాసం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతరిక్ష రంగం అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు అవసరమని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు.
అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని, దేశం మొత్తం అభివృద్ధి చెందాలన్నారు. ప్రధాని మోదీ విజన్ను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తాను అన్వేషకుడినన్న ఇస్రో చైర్మన్.. సైన్స్, ఆధ్యాత్మిక రెండింటినీ అన్వేషించడం నా జీవిత ప్రయాణంలో ఓ భాగమన్నారు. అనేక ఆలయాలను సందర్శిస్తానని, గ్రంథాలను చదువుతానన్నారు. విశ్వాసాన్ని పెంచుకోవడం ద్వారా ప్రతి గ్రహానికి ప్రయాణించగలమన్నారు. చంద్రయాన్-3 ప్రయోగంపై స్పందిస్తూ.. ప్రస్తుతం ల్యాండర్, రోవర్ బాగా పని చేస్తున్నాయన్నారు. చంద్రయాన్-3 బోర్డులో ఏర్పాటు చేసిన ఐదు పరికరాలు డేటాను అందిస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో అన్ని ప్రయోగాలను పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
#WATCH | Kerala: ISRO chief S Somanath offers prayers at Pournamikavu, Bhadrakali Temple in Thiruvananthapuram. pic.twitter.com/8MjqllHeYb
— ANI (@ANI) August 27, 2023