సీఎం మమతా బెనర్జీ తనకు ఎంతో దగ్గర అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా గంగూలీ పై వ్యాఖ్యలు చేశారు. సీఎం మమతా బెనర్జీ నాకెంతో దగ్గర. ఈ ఆస్పత్రిని ప్రారంభించాలనుకున్న వైద్యుడ్ని ఆమె దగ్గరికి తీసుకెళ్లాను. ఆమె ఎంతో సహాయం చేశారు. ఎవరు సహాయార్థం వెళ్లినా.. సహాయం చేస్తుంటారు. చాలా సార్లు నేను కూడా సీఎం మమతను కలుసుకున్నాను అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చారు.
ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చారు?
గంగూలీ ఇంటికి కేంద్ర హోంమంత్రి అమిత్షా వెళ్లారు. భోజనం కూడా చేశారు. కాసేపు మాట్లాడుకున్నారు. దీంతో రాజకీయ కోణం వైపు ఈ భేటీ మళ్లింది. గంగూలీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని, అందుకే అమిత్షా వెళ్లారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలోనే గంగూలీ పై విధంగా స్పందించారు.