న్యూఢిల్లీ, నవంబర్ 11: వందేండ్ల కిందట చోరీకి గురైన ‘అన్నపూర్ణ దేవి’ విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం ఉత్తరప్రదేశ్ సర్కారుకు అందజేశారు. ఈ విగ్రహం 18వ శతాబ్దానికి చెందినది. వందేండ్ల కిందట ఇది కాశీలో చోరీకి గురైంది. కెనడాకు స్మగ్లింగ్ చేశారు. కెనడా ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ఇటీవల భారత సర్కారుకు అందజేసింది. అక్టోబర్ 15న విగ్రహం కెనడా నుంచి భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ)కి చేరింది. తాజాగా ఆ విగ్రహాన్ని యూపీ సర్కారుకు అప్పగించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. 1976 నుంచి ఇప్పటివరకు విదేశాలకు స్మగ్లింగ్ అయిన 55 ప్రాచీన విగ్రహాలను భారత్కు తిరిగి రప్పించారు.