న్యూఢిల్లీ: సహజీవనం చేస్తున్న 26 ఏళ్ల శ్రద్ధా వాల్కర్ను 28 ఏళ్ల ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా అత్యంత క్రూరంగా చంపిన విషయం తెలిసిందే. లవర్ను 35 ముక్కలు చేసి.. ఫ్రిడ్జ్లో దాచి.. ఆ తర్వాత ఆమె శరీరా భాగాలను ఢిల్లీలోని పలు ప్రదేశాల్లో పడేశాడు. అయితే ఆ ఘటనకు చెందిన మరికొన్ని వివరాలను ఇవాళ పోలీసులు వెల్లడించారు. శ్రద్ధాను చంపి ఆమె శరీర భాగాలను ఫ్రిడ్జ్లో దాచి పెట్టిన సమయంలోనే.. తన రూమ్కు మరో గర్ల్ఫ్రెండ్ను అఫ్తాబ్ తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అఫ్తాబ్, శ్రధ్దాలు బంబ్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యారు. ముంబైలో ఆ ఇద్దరి మధ్య రొమాన్స్ మొదలైంది. మూడేళ్ల పాటు సహజీవనం చేశారు. అయితే ఢిల్లీలో ఈ ఏడాది మే నెలలో శ్రద్ధాన అతను చంపేశాడు. శ్రద్ధాను చంపిన 20 రోజుల వ్యవధిలోనే అదే డేటింగ్ యాప్లో మరో అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. ఆమెతోనూ డేటింగ్ మొదలుపెట్టాడు. ఆ అమ్మాయిని కూడా పదేపదే ఇంటికి తీసుకువచ్చాడు. ఆ సమయంలో అపార్ట్మెంట్లోనూ శ్రద్ధ శరీర భాగాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
300 లీటర్ల ఫ్రిడ్జ్ను తీసుకువచ్చి.. సుమారు 35 శరీర భాగాలను దాంట్లో దాచాడు. అయితే కొత్త గర్ల్ఫ్రెండ్ను ఇంటికి తీసుకువచ్చిన సమయంలో ఆ ముక్కలను కప్బోర్డ్లోకి మార్చేశాడు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ వత్తిడి చేయడం వల్లే ఆఫ్తాబ్ ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.
శిక్షణ పొంది చెఫ్ అయిన అఫ్తాబ్.. రక్తపు మరకలను ఎలా క్లీన్ చేయాలి, మానవ శరీర నిర్మాణం గురించి గూగుల్లో సెర్చ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతను వాడిన కత్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శ్రద్ధా సజీవంగా ఉందని తెలిసేందుకు ఆమెకు చెందిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను అఫ్తాబ్ వాడాడు. ఆ అకౌంట్ ద్వారా శ్రద్ధా ఫ్రెండ్స్తో అతను టచ్లో ఉన్నాడు. కానీ రెండు నెలలుగా ఫోన్ స్విచాఫ్ ఉండడంతో శ్రద్ధా ఫ్రెండ్స్కు అనుమానం వచ్చింది.