న్యూఢిల్లీ : ప్రముఖ నటి, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. కొవిడ్ పరీక్షలు చేసుకోగా.. పాజిటివ్గా వచ్చిందని, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు పేర్కొంది. గత కొద్ది రోజులుగా తాను ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం లేదని, ఎవరినీ కలువడం లేదని చెప్పింది. వైద్యుల సలహా తీసుకుంటున్నట్లు పేర్కొంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్లు ధరించాలని సూచించింది. ఇటీవల బాలీవుడ్తో పాటు బుల్లితెరకు చెందిన చాలా మంది నటీనటులు కరోనా బారినపడ్డారు. రెండు రోజుల కిందట బాలీవుడ్ చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ సైతం కొవిడ్కు పాజిటివ్గా పరీక్ష చేసిన సంగతి విధితమే. అంతకు ముందు నటుడు అర్జున్ కపూర్, అతని సోదరి అన్షులాతో మరో ఇద్దరు కుటుంబీకులు కరోనా బారినపడ్డారు.