న్యూఢిల్లీ, జూలై 23: నలుగురు పిల్లల తండ్రి అయిన బీజేపీ ఎంపీ రవికిషన్ జనాభా నియంత్రణపై లోక్సభలో ప్రైవేటు బిల్లు తీసుకొస్తాననడంపై నెటిజన్లు చురకలంటిస్తున్నారు. ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మందిని కనకూడదన్నది ఆ బిల్లు ఉద్దేశం. ‘జనాభా నియంత్రణ చేయడం చాలా ముఖ్యం.
నేను బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రతిపక్షాలు సహకరించాలి. ఎందుకు ప్రవేశపెట్టాలనుకుంటున్నానో వినండి’ అని పేర్కొన్నారు. జనాభా నియంత్రణ గురించి చెబుతున్న రవికిషన్కు నలుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తున్నది. ముందు నీ సంగతి చూసుకుని తర్వాత జనాభా నియంత్రణ గురించి మాట్లాడాలంటూ కామెంట్లు చేస్తున్నారు.