INIDA | న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమికి పూర్తిస్థాయి రూపం ఏర్పడకపోయినప్పటికీ అప్పుడే ప్రధాని మావాడంటే మా వాడంటూ పార్టీలు ప్రకటిస్తున్నాయి. మొన్న నితీశ్, నిన్న రాహుల్ ప్రధానిగా ఉండాలని ఆయా పార్టీలు పేర్కొనగా ఇప్పుడు ఆ లిస్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా చేరారు.
తమ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఇండియా కూటమి తరఫున ప్రధాని పదవికి సరైన వ్యక్తి అని ఆప్ నేత ప్రియాంక కక్కర్ పేర్కొన్నారు. కాగా, తమ నేతకు అలాంటి కోరికేమీ లేదంటూ ఆ పార్టీకి చెందిన నేతలు అతిషి, సంజయ్ సింగ్ దానిని ఖండించారు. కక్కర్ మాట్లాడుతూ వినూత్న పాలనను అందించి కేజ్రీవాల్ ఇండియా తరఫున ప్రధాని అభ్యర్థిగా తగిన వారని, దానివల్ల కూటమికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు.