న్యూఢిల్లీ: జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్సింగ్కు రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయటానికి అనుమతి దొరకలేదు. సోమవారం ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. అందుకు రాజ్యసభ చైర్మన్ జగదీస్ ధన్ఖర్ నిరాకరించారు. సంజయ్సింగ్పై ప్రివిలేజ్ కమిటీ విచారణ జరుపుతున్న సంగతిని ధన్ఖర్ గుర్తు చేశారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయినా సంజయ్ సింగ్ ను ఆప్ మరోసారి రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేసింది. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉందని, పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు వారం పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. కానీ ప్రమా ణ స్వీకారానికి మాత్రమే అనుమతి లభించింది. కాగా..కోర్టు అనుమతితో ప్రమాణ స్వీకారం కోసం పార్లమెంట్కు రాగా అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.