జలంధర్: ఆమ్ ఆద్మీ పార్టీ నేత లక్కీ ఒబ్రాయ్(Lucky Oberoi)ని హత్య చేశారు. జలంధర్ సిటీలోని మోడల్ టౌన్ లొకాలిటీలో ఉన్న గురుద్వారా వద్ద ఈ ఘటన జరిగింది. గన్తో కాల్చి చంపారు. లక్కీ ఒబ్రాయ్ని ఫోర్టిస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తీవ్ర గాయాలు కావడంతో అతను ప్రాణాలు విడిచాడు. గురుద్వారకు రోజువారిలాగానే అతను తన థార్ వాహనంలో చేరుకున్నాడు. వాహనాన్ని పార్క్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. ఇద్దరు వ్యక్తులు టూవీలర్పై వచ్చినట్లు తెలుస్తోంది. గురుద్వారాకు ఒబ్రాయ్ రోటీన్గా విజిట్ చేస్తుంటారని జలంధర్ కంటోన్మెంట్ ఇంఛార్జీ రాజ్విందర్ తియారా తెలిపారు. అతనిక కదలికలు తెలిసిన వ్యక్తులే దాడికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.