ఛత్తీస్గఢ్ : కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ యువకుడిని హత్య చేశారు. మృతుడిని గట్టగల్కు చెందిన దినేశ్ నూరేటిగా పోలీసులు గుర్తించారు. గట్టగల్లో ఆదివాసీల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహించి, దినేశ్ను మావోయిస్టులు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.