Somali sea pirates | ఇటీవలే కాలంలో సముద్రపు దొంగలు (sea pirates) రెచ్చిపోతున్నారు. హిందూ మహాసముద్రం మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాణిజ్య నౌకలను హైజాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత నేవీ వారి ఆటకట్టించింది. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి సుమారు 35 మంది సముద్రపు దొంగలను బంధించింది. సోమాలియా (Somali) తీరంలో పట్టుబడిన ఆ 35 మంది దొంగలతో కూడిన భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్కతా (INS Kolkata) ఇవాళ ఉదయం ముంబై చేరింది. అనంతరం పట్టుబడిన వారిని పోలీసులకు అప్పగించింది. ఈ విషయాన్ని భారత నేవీ (Indian Navy) శనివారం వెల్లడించింది.
కాగా, అరేబియా సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో వాణిజ్య నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోయేందుకు ఇండియన్ నేవీ ‘ఆపరేషన్ సంకల్ప్’ చేపట్టిన విషయం తెలిసిందే. సముద్రంలో భారీగా యుద్ధ నౌకలను మోహరించింది. ఈ నేపథ్యంలోనే గతేడాది సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఎంవీ రుయెన్ అనే నౌకను ఈ నెల 15న సుమారు 40గంటల పాటు ఆపరేషన్ చేపట్టి ఐఎన్ఎస్ కోల్కతా రక్షించింది. అందులోని 35 మంది సముద్రపు దొంగలను బంధించింది. ఈ క్రమంలోనే వారిని ముంబైకి తరలించి పోలీసులకు అప్పగించింది. ఈ ఆపరేషన్లో ఐఎన్ఎస్ కోల్కతాకు సాయంగా ఐఎన్ఎస్ సుభద్ర కూడా చేరింది. ఈ రెండింటికి సపోర్టుగా భారత వాయుసేన కూడా రంగంలోకి దిగడంతో ఆపరేషన్ మరింత ఈజీగా ముగిసింది. ఈ ఆపరేషన్కు సీ గార్డియన్ యూఏవీ, పలు ఆధునిక డ్రోన్లను సైతం నేవీ ఉపయోగించింది.
#WATCH | A total of 35 Somali sea pirates were forced to surrender by the Indian Navy by deploying its commandos and other assets.
They were brought to India by the warship INS Kolkata and handed over to Mumbai Police today.
(Video Source: India Navy) pic.twitter.com/FCh6Ambitk
— ANI (@ANI) March 23, 2024
Also Read..
Arvind Kejriwal | ఆ పోలీసు అధికారి నాతో దురుసుగా ప్రవర్తించాడు.. కేజ్రీవాల్ ఆరోపణ
Elephant Fight | ఆలయ ఊరేగింపులో అపశ్రుతి.. ఏనుగుల ఫైటింగ్తో తొక్కిసలాట.. VIDEO