న్యూఢిల్లీ, మార్చి 31: ఢిల్లీలో విషాదం చోటుచేసుకొన్నది. దోమల నివారణకు వెలిగించిన మస్కిటో కాయిల్ (దోమల బత్తి) ఆరుగురిని బలి తీసుకొన్నది. దోమలబత్తి పరుపుపై పడి మంటలు చెలరేగడంతో ఊపిరాడక చిన్నారితో సహా ఆరుగురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
శాస్త్రిపార్క్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి వారు మస్కిటో కాయిల్ అంటించి పడుకున్నారు. దోమల బత్తి పరుపుపై పడటంతో పొగ అలుముకున్నది. వారు బయటపడేందుకు ప్రయత్నించినా.. విషవాయువులు పీల్చడంతో స్పృహతప్పి పడిపోయారు. శుక్రవారం ఇంటి నుంచి మంటలు రావడం చూసి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.