ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కర్ణాటక రాజధాని బెంగళూరు అతలాకుతలమవుతోంది. స్మార్ట్సిటీలో భాగంగా నిర్మించిన రోడ్లపై వరదలు పారుతున్నాయి. దీంతో నగరవాసులు నరకం చూస్తున్నారు. మారతహళ్లి-సిల్క్ బోర్డు జంక్షన్ రోడ్డులో నాలుగు గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదే రోడ్డు సమీపంలో ఓ వ్యక్తి నీటిలో చిక్కుకుపోగా, సెక్యూరిటీగార్డు రక్షించాడు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది.
1.40 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో వీధి మధ్య వరద నీటిలో ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. ఆ వ్యక్తిని గమనించిన ఓ సెక్యూరిటీ గార్డు చేయందించాడు. మరో ఇద్దరితో కలిసి అక్కడే ఉన్న క్రేన్పైకి అతడిని సురక్షితంగా లాగారు. ఈ వీడియో స్మార్ట్ సిటీ బెంగళూరు దుస్థితికి అద్దంపడుతోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అధికారులు, నాయకులపై బెంగళూరు నగరవాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
#WATCH | Karnataka: A man was rescued by local security guards after he was stuck on a waterlogged road near Marathahalli-Silk Board junction road in Bengaluru pic.twitter.com/gFnZtzk6mu
— ANI (@ANI) September 5, 2022