మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ముంబై-గోవా హైవేపై ఓ ఫ్లైఓవర్ కూలిపోయింది. దీని కిందనున్న ఓ క్రేన్ తీవ్రంగా దెబ్బతింది. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి ఎగసిపడటంతో ఆ మార్గంలో వెళ్తున్నవారంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత గురించి అధికారులు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్పై విరుచుకుపడ్డారు.