చెన్నై, మార్చి 12: తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిపై కేసు నమోదైంది. తనపై పళనిస్వామి నేతృత్వంలో పలువురు అన్నాడీఎంకే నేతలు దాడి చేశారని ఏఎంఎంకే నేత రాజేశ్వరన్ ఫిర్యాదు మేరకు పళనిస్వామి సహా ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు అవనియపురం పోలీసులు తెలిపారు.
మధురై ఎయిర్పోర్టు బస్సులో పళనిస్వామి ప్రయాణిస్తున్నప్పుడు రాజేశ్వరన్ తన ఫోన్లో ఫేస్బుక్ లైవ్ పెట్టి పళనిస్వామిపై విమర్శలు చేశాడు. దీంతో పళనిస్వామి అనుచరులు ఫోన్ లాక్కొని పోలీసులకు అప్పగించారు. తనపై దాడి చేశారని రాజేశ్వరన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై రాజేశ్వరన్ మీద కూడా కేసు నమోదు చేశారు.