న్యూఢిల్లీ, జనవరి 28: దేశవ్యాప్తంగా బాలికలపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయి. 2016-22 మధ్య ఈ ఘటనలు 96 శాతం పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డాటాను విశ్లేషించిన చైల్డ్ రైట్స్ అండ్ యూ (సీఆర్వై) స్వచ్ఛంద సంస్థ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది.
ప్రజల్లో చైతన్యం రావడం, సాంకేతికత పెరగడం, ఫిర్యాదులు సులభతరం కావడం వల్ల బాలికలపై లైంగికదాడి కేసులు అధికంగా నమోదైనట్టు సీఆర్ఐ సంస్థ డైరెక్టర్ సుభేందు భట్టాచార్జి తెలిపారు. 2021-22 మధ్యకాలంలో ఇలాంటి కేసుల పెరుగుదల 6.9 శాతంగా ఉండగా, 2016-22 సంవత్సరాల మధ్య పెరుగుదల 96.8 శాతం ఉన్నట్టు పేర్కొన్నారు.