భిలాస్పూర్, మే 6: మద్యం దొరకని పరిస్థితుల్లో ఆల్కహాల్తో తయారైన హోమియోపతి మందు తాగి ఛత్తీస్గఢ్లోని భిలాస్పూర్ జిల్లాలో రెండు రోజుల్లో 9 మంది చనిపోయారు. మృతులంతా కూర్మి గ్రామానికి చెందినవారని, డ్రోసెరా-30 అనే ఔషధాన్ని తాగడం వల్ల మరణించి ఉంటారని అధికారులు తెలిపారు. 9 మందిలో నలుగురు మంగళవారం వారి ఇండ్లలోనే చనిపోయారు. కొవిడ్తో చనిపోయి ఉంటారని కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం ముగ్గురు దవాఖానలో చనిపోయారు. దీంతో హోమియో మందు విషయం తెలిసి.. పోలీసులు గ్రామంలో ఆరా తీశారు. హోమియో మందు తాగిన మరికొందర్ని దవాఖానలో చేర్చారు. వారిలో ఇద్దరు గురువారం చనిపోయారు.