Lok Sabha Elections | న్యూఢిల్లీ: 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన 8,360 మంది అభ్యర్థుల్లో 7,190 మంది తమ డిపాజిట్లను కోల్పోయారు. అంటే 86 శాతం మందికి తగినన్ని ఓట్లు లభించలేదన్నమాట. వీరిలో 584 మంది ఆరు గుర్తింపు పొందిన పార్టీలకు చెందినవారు, 68 మంది గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల అభ్యర్థులు, 2,633 మంది రిజిస్టర్ అయి, గుర్తింపు పొందని రాజకీయ పార్టీలకు చెందినవారు. కాగా స్వతంత్ర అభ్యర్థులు 3,095 మంది. వీరిలో ఏడుగురు మాత్రమే విజయం సాధించారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది.
2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో చెల్లుబాటైన ఓట్లలో 63 శాతం ఓట్లు 6 జాతీయ పార్టీలకు లభించాయి. ఈ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం, ఆప్, ఎన్పీపీ. ఈ పార్టీలతో పాటు గుర్తింపుపొందిన 47 రాష్ట్ర ప్రాంతీ య పార్టీలు, 690 నమోదైన, గుర్తింపు పొందని పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. 3,921 మంది స్వతంత్రులు పో టీ చేయగా, ఏడుగురు గెలిచారు. నోటా మీటకు 63,71,839 (అంటే,0.99 శాతం) ఓట్లు లభించాయి. దీనికి 2019లో 1.06 శాతం ఓట్లు వచ్చాయి.
97.97 కోట్లు దేశంలోని మొత్తం ఓటర్లు
64.64 కోట్లుఓటింగ్లో పాల్గొన్నవారు
65.78% మహిళలు
65.55% పురుషులు
ఈవీఎం ద్వారా ఓటు వేసిన వారు: 64,21,39,275
పోస్టల్ బ్యాలట్ ఆప్షన్ను వినియోగించుకున్నారు:సుమారు 43 లక్షల మంది