న్యూఢిల్లీ, డిసెంబర్ 8: 2017-2021 మధ్య సివిల్స్ మెయిన్స్ క్లియర్ చేసిన అభ్యర్థుల్లో 63 శాతం మంది ఇంజినీరింగ్ చదివిన వారేనని కేంద్రం వెల్లడించింది. ఆ నాలుగేండ్ల కాలంలో మొత్తం 4,371 మంది సివిల్స్కు ఎంపిక కాగా, వీరిలో 2,783 మంది ఇంజినీరింగ్ విద్య చదివినవారేనని తెలిపింది.
1,033 మంది హ్యుమానిటీస్, 315 మంది సైన్స్, 240 మంది మెడికల్ సైన్స్ చదివారని పేర్కొన్నది. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ మేరకు డాటాను రాజ్యసభలో గురువారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హ్యుమానిటీస్లో 597 మంది, ఇంజినీరింగ్లో 243 మంది పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారని వివరించింది.