బెంగళూరు, జనవరి 31: దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసే బోర్డులపై 60 శాతం కన్నడ ఉండాలంటూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను గవర్నర్ తిప్పి పంపారు. తొలుత ఈ ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించాలని గవర్నర్ సూచించినట్టు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ చెప్పారు. కన్నడ భాషను కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.