చండీగఢ్: పంజాబ్ నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందు ఆ రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొత్తగా మంత్రి పదువులు చేపట్టబోయే వారి జాబితాలో రాణా గుర్జీత్ సింగ్ పేరు కూడా ఉండటాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. అవినీతి ఆరోపణలున్న రాణా గుర్జీత్సింగ్కు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి ఇవ్వవద్దని ఆ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు ఆరుగురు పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నవతేజ్సింగ్ చీమా, బల్విందర్ సింగ్ ధలివాల్, బవా హెన్రీ, డాక్టర్ రాజ్ కుమార్, పవన్ అదియా, సుఖ్పాల్సింగ్ ఖైరాతోపాటు, పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు మోహిందర్సింగ్ కైపీ.. ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీకి, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు లేఖలు రాశారు. రాణా గుర్జీత్ సింగ్కు బదులుగా ఓ దళిత నాయకుడి మంత్రివర్గంలో చోటుకల్పించాలని ఆ లేఖలో కోరారు. మరి ఈ లేఖలపై సీఎం, పీసీసీ చీఫ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.