హైదరాబాద్ : భారతదేశంలో దాదాపు 54 శాతం మంది విద్యార్థులు ఆన్లైన్ లెర్నింగ్ మోడల్తో సౌకర్యవంతంగా ఉన్నారు. ఈ విషయం ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ బ్రెయిన్లీ చేసిన సర్వేలో తేలింది. కరోనా నేపథ్యంలో గతేడాదిగా దేశవ్యాప్త విద్యార్థుల అభ్యసన విధానాలు ఏ విధంగా మారాయో తెలుసుకునేందుకు 2,371 మంది విద్యార్థులపై ‘లాక్డౌన్ అండ్ లెర్న్-ఫ్రమ్-హోమ్ మోడల్’ అనే పేరుతో సర్వే నిర్వహించింది.
కొవిడ్ -19 కేసులు ఇటీవల విపరీతంగా పెరగడంతో చాలా మంది విద్యార్థులు పాఠశాలలకు తిరిగి వెళ్లేందుకు భయపడుతున్నారు. ప్రస్తుత కాలంలో 56 శాతం మంది విద్యార్థులు ఆన్లైన్ లెర్నింగ్లో కొనసాగడానికి ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా మూడింట రెండొంతుల మంది విద్యార్థులు మునుపటికంటే ఇప్పుడు ఎక్కువ సౌకర్యవంతంగా, స్వావలంబనను కలిగి ఉన్నారంది. ఆన్లైన్ ఫ్లాట్ఫారమ్లు వేగంగా నేర్చుకునేందుకు సహాయపడ్డాయని పెద్ద సంఖ్యలో విద్యార్థులు పేర్కొన్నారు.
బ్రెయిన్లీలో 350 మిలియన్లకు పైగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కూడిన సంఘం ఉంది. భారతదేశం నుండి 55 మిలియన్ల యూజన్లను కలిగిఉంది. యూఎస్, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పోలాండ్ వంటి తదితర దేశాల నుండి కూడా విద్యార్థులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.