చెన్నై, మే 19: దాదాపు 500 ఏండ్ల కిందటి అరుదైన శివుడి విగ్రహాన్ని చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు దుండగులు ఈ విగ్రహాన్ని విక్రయానికి పెట్టినట్టు సమాచారం అందుకున్న పోలీసులు మారువేశంలో వారిని కలిశారు.
విగ్రహాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. దీంతో దుండగలు రూ.25 కోట్లకు అమ్ముతామన్నారు. పోలీసులు ఒప్పుకున్నారు. వెంటనే దుండగులు రహస్య ప్రదేశం నుంచి విగ్రహాన్ని తీసుకురాగానే స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ విగ్రహం నేపాల్కు చెందినదై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.