మేఘాలయాలో కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా మేఘాలయ డెమోక్రెటిక్ అలయన్స్లో చేరుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సీఎం కోన్రాడ్ సంగ్మాకు ఓ లేఖ రాశారు. రెండు నెలల క్రితం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ అలయెన్స్లో చేరిపోయారు. తాజాగా మిగిలిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అలయెన్స్లో చేరుతున్నట్లు ప్రకటించారు. మీ ప్రభుత్వానికి, మీ నిర్ణయాలకు మేం పూర్తి మద్దతిస్తాం. ప్రభుత్వానికి మరింత బలాన్నిస్తాం. అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు.
ఈ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా సంకీర్ణ ప్రభుత్వంలోకి స్వాగతించారు. అంపరీన్ లింగ్డో, మేరల్బోర్న్ సయీమ్, మహేంద్రో రప్సంగ్, కింఫా మార్బానియంగ్, పీటీ సాక్మీ.. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు మేఘాలయ డెమోక్రెటిక్ అలయన్స్లో చేరారు. దీంతో మేఘాలయ కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. 2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 21 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. గత యేడాది 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్లో చేరుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.