న్యూఢిల్లీ: ఐదు నెలల పాపకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లి మన స్సు తల్లడిల్లుతుంది. అలాంటిది పువ్వు లాంటి శరీరం రోజురోజుకూ రాయిలా మారుతుంటే ఆ తల్లి నిస్సహాయత వర్ణనాతీతం. బ్రిటన్కు చెందిన అలెక్స్, దవె దంపతులకు ఐదు నెలల క్రితం పాప పుట్టింది. రోజులు గడిచే కొద్ది పాప చేతి, కాలి బొటన వేళ్లు కదలడం లేదని గుర్తించారు. వైద్యులు పరీక్షలు చేయగా ఆమెకు ఫైబ్రోడిస్ప్లాసియా ఓసిఫికన్స్ ప్రొగ్రెస్సివా(ఎఫ్ఓపీ) అని తేలింది. ఇది అత్యంత అరుదైన వ్యాధి. ఇది వస్తే కీళ్ల దగ్గర ఎముకలు పెరుగుతాయి. ఫలితంగా కాళ్లు, చేతులు, వేళ్లు ఇలా శరీరంలో ఏ భాగాన్ని కలపడానికి వీలు కాదు. చివరకు శరీరం చలనరహితమై రాయిలా మారుతుంది. దీనికి ఇప్పటివరకు చికిత్స లేదు.